Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 10, 2026Short Read
తిరుమలలో విపరీతంగా పెరుగుతున్న భక్తుల రద్దడి – శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం!
బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దడి విపరీతంగా పెరుగుతోంది.
ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుండగా, బాట గంగమ్మ గుడి వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
అటు నిన్న 77,670 మంది స్వామివారిని దర్శించుకోగా, 33,904 మంది తలనీలాలు సమర్పించారు.
అలాగే హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా నమోదైంది.
కాగా ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.





